కొంప ముంచిన ఫ్రెండ్షిప్.. రూ.కోటి 60 లక్షల మోసం

-

ఈజీగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో కొందరు యువకులు భారీ మోసానికి తెరలేపారు. వ్యసనాలకు అలవాటై మోసాలకు పాల్పుడుతున్న ఐదురుగు నిందితులను రాచకొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అన్సారీ, ముర్షీద్, వికాస్ సింగ్‌తోపాటు మరో వ్యక్తి కలిసి గతంలో నకిలీ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అనుభవం వచ్చాక ఘాజియాబాద్‌లో సొంతంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరో ముగ్గురిని టెలీ కాలర్స్‌ను నియమించుకున్నారు. డబ్బు చెల్లించి ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నవారి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే రాచకొండ పరిధిలో ఉంటున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి వివరాలు కనుక్కొని ఫోన్ చేసి విసిగించడం ప్రారంభించారు.

- Advertisement -

ఇప్పటికే మీరు తీసుకున్న పాలసీపై భారీ లబ్ది చేకూరుస్తామని నమ్మించారు. కోట్ల రూపాయల నకిలీ డీడీల ఫోటోలు చూపించారు. అతని సాయంతో మరికొందరు అతని మిత్రులను ఉచ్చులోకి లాగి.. జీఎస్టీ కట్టాలని నమ్మించారు. ఇలా 2016 నుంచి 2022 వరకు సదరు రిటైర్డ్ ఉద్యోగితో పాటు అతను పరిచయం చేసిన వారి నుంచి దఫా దఫాలుగా రూ.కోటి 60 లక్షలు లాగాడు. ఆ తర్వాత మోస పోయామని గ్రహించిన బాధితులు రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also:
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులకు బెయిల్ నిరాకరణ

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్: సీఎం రేవంత్ రెడ్డి

20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై...

బీఆర్ఎస్‌ పార్టీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరునున్న ఎమ్మెల్యే..

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్...