పూజ పేరుతో మహిళపై అత్యాచారం..రోగం తగ్గిస్తానని కోరిక తీర్చుకున్నాడు!

Villagers beaten to death with sticks

0
166

ఏపీ: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జరుగుమల్లి మండలం కామేపల్లిలో ఓ మహిళకు మంత్రంతో రోగం తగ్గిస్తానని నెపంతో తన కామ వాంఛ తీర్చుకోపోయాడు ఓ నీచుడు. క్షుద్ర పూజలో కూర్చోబెట్టి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ ప్రతి ఘటించడంతో పూజలోనే మహిళను హత్య చేసి నీచమైన పనికి పూనుకున్నాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో..మహిళను చంపిన వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అడ్డుకోపోగా పోలీసులను స్ధానికులు చితకబాదారు. ఆదివారం రాత్రి ఈ ఘోరమైన ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.