హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం..ఏడుగురు అరెస్ట్

Seven arrested in Hyderabad

0
65

హైదరాబాద్‌లో గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఎస్సార్‌ నగర్, అమీర్‎పేట్‎లో టాస్క్ ఫోర్స్ పోలీసులు మత్తుమందును విక్రయిస్తున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అమీర్‌పేట, ఎస్సార్‌ నగర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు.

నిందితుల నుంచి సుమారు 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒక మహిళ, ఆరుగురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదుచేసి ఎస్పార్‌ నగర్ పోలీస్ స్టేషన్‎కు తరలించారు.