Siddipet | భార్య పిల్లలను చంపి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య

-

సిద్ధిపేట(Siddipet) జిల్లాలో దారుణం జరిగింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్న ఆకుల నరేష్ భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నకోడూర్‌లోని రామునిపట్లలో నరేశ్ కుటుంబంతో కలిసి ఉంటున్నారు. తన వద్ద ఉన్న 9 ఎంఎం పిస్టల్‌తో ముందుగా భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీను కాల్చేశాడు. అనంతరం తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

- Advertisement -

Siddipet | అయితే ఇవాళ విధులకు రాకపోవడంతో సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా నలుగురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక కుటుంబ కలహాలు కారణమా? మరేదైనా కారణాలు ఉన్నాయా.? అని ఆరా తీస్తున్నారు.

Read Also: ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...