వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు- శోభనం గదిలో ఏం జరిగిందంటే

They both fell in love and got married- That’s what happened in the mourning room

0
41

వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ వచ్చారు. ఎంతో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. కానీ శోభనం రోజు మాత్రం అనూహ్యమైన ఘటన రెండు కుటుంబాలల్లో షాక్ కి గురిచేసింది.ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎలాంటి వివాదాలు, గొడవలు ఉండవు అని అనుకున్నారు. కానీ ఏం జరిగిందో కాని
నూతన వధూవరులు ఇద్దరు శోభనం గదిలో ఆత్మహత్యకు ప్రయత్నించారు.

బిహార్లోని సోనేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ ఘటన. జమ్షెడ్పూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల శాంతీ దేవి, ముకేష్ కుమార్ సింగ్ ప్రేమించుకున్నారు. వీరు పెద్దలను ఒప్పించి గుడిలో వివాహం చేసుకున్నారు. రిసెప్షన్ పూర్తైన తర్వాత వారికి శోభనం ఏర్పాటు చేశారు. అయితే రూమ్ లో ఏమైందో తెలియదు కానీ, ఉదయం పెద్దలు వారి రూమ్ డోర్ కొడితే తీయలేదు.

చివరకు పెద్దలు వచ్చి చూస్తే ఇద్దరూ అపస్మారక స్దితిలో ఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. గదిలో వారి పక్కనే చికెన్ కూర కలిపిన అన్నం ఉండటంతో, అందులో విషం కలుపుకున్నారు అనే అనుమానం వస్తోంది. వారిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిద్ద‌రూ కోలుకున్నాకే అసలు ఏమైందో తెలియనుంది.