Medaram | దారులన్నీ మేడారం వైపే.. పోటెత్తిన భక్తజనం.. 

-

తెలంగాణ కుంభమేళా మేడారం(Medaram) మహా జాతర ప్రారంభమైంది. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో దారులన్ని మేడారం వైపే కదిలాయి. నేటి నుంచి నాలుగు రోజులపాటు సాగే ఈ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర ప్రారంభానికి వారం పది రోజుల ముందు నుంచే భక్తులు మేడారం తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

- Advertisement -

మేడారం(Medaram) జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. “గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన,మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం” అని తెలిపారు. ఇక ఈనెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి మేడారం వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు.

Read Also: తిన్న కంచంలో చెయ్యి కడగకూడదు అంటారు ఎందుకు?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Prasanna Vadanam | ‘ప్రసన్న వదనం’ ట్రైలర్ విడుదల.. సస్పెన్స్ అదిరిపోయిందిగా..

యువ హీరో సుహాస్(Suhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఇటీవలే...

Malla Reddy | మల్కాజిగిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. ఈటలతో మల్లారెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)...