Solar eclips: గ్రహణంమైనా తెరిచి ఉండే రెండు ఆలయాలు

-

Solar eclips: నేడు భారత్‌లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం అరుదైనదని 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతుందని శాస్రవేతలు చెబుతున్నారు. సాయంత్రం 4.29 నుంచి గ్రహణకాలం ప్రారంభం కాగా.. గరిష్టంగా గంట 45 నిమిషాల పాటు గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ పాక్షిక గ్రహణం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలోని, తిరుమల, విజయవాడ, శ్రీశైలం, యాదాద్రి, భద్రాచలం సహా పలు ప్రముఖ ఆలయాలను మూసివేశారు.

- Advertisement -

కానీ ఈ సమయంలో ఏపీలో రెండు ఆలయాలు తెరిచి ఉంటాయి. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయం, కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయలను ఏ గ్రహణం వచ్చినా తెరిచే ఉంచుతారు. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణ కాల అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో వెలిసిన వాయులింగేశ్వరున్ని, సూర్యచంద్రాగ్నిలోచనుడు అంటారు. ఈ క్షేత్రనికి రాహు, కేతువుల ప్రభావం ఉండదని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో తెరిచి ఉంచే రెండవ ఆలయం సంగమేశ్వర ఆలయం. సూర్య గ్రహణ (Solar eclips) సమయంలో ఈ ఆలయంలో అరుణ హోమం నిర్వహించి.. గ్రహణం వేళ ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. అయితే ఈ దేవాలయం వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది. నీరు లేని సమయంలో మాత్రమే భక్తులు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

Read also: అధికార పార్టీపై జనసేన వ్యంగ్య కార్టున్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...