Flash: పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక

0
44

కలుషిత పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలనాయుడు పేటలో చోటు చేసుకుంది. గ్రామంలోని కొబ్బరితోటలో లభించిన పుట్టగొడుగులను 8 కుటుంబాలకు చెందిన వారు రాత్రి భోజనంలో తిన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి వాంతులు కావడంతో వారిని టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.