తెలంగాణలో కాస్త శాంతించిన కరోనా..కొత్త పాజిటివ్ కేసులు ఎన్నంటే?

0
45

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 88,867 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..3,801  పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే  1,570 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. నేడు ఒకరు క‌రోనా కాటుకు బలయ్యారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా కాటుకు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,076కి చేరింది. అలాగే నేడు క‌రోనా వైర‌స్ నుంచి 2,046 మంది కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 38,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి.