Drinking Water: శరీరానికి సరిపడా నీళ్లు తాగుతున్నారా?

-

Drinking Water How much should drink your body: శరీరం కాంతివంతంగా మెరవాలన్నా, శరీరంలో ఉన్న మలినాలు బయటకు పోవాలన్నా, మెదడు పని తీరు, శ్వాస, జీర్ణక్రియ వంటి పనులు క్రమపద్ధతిలో జరగాలన్నా నీరు ఎంతో అవసరం. శరీరానికి అవసరమైన నీటిని తీసుకోకపోతే, డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. చెమట పట్టినప్పుడు, ఏడ్చినప్పుడు, మూత్ర విసర్జన చేసినప్పుడు శరీరంలోని నీటిని కోల్పోతుంటాం. అలా కోల్పోయిన నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. దీనివల్ల డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండొచ్చు. అయితే, మన శరీరం ఎప్పటికప్పుడు నీటిని తాగాలని చెప్తూనే ఉంటుంది.. దాని మాట వినాలి.. శరీరం మాట్లాడుతుందా అని సందేహం వ్యక్తం చేయకండి..

- Advertisement -

మన శరీరంలో నీటి స్థాయి తగ్గగానే, మన బాడీ మనకు కొన్ని సిగ్నల్స్‌ ఇచ్చేస్తుంది. వాటిని ఫాలో అయిపోయి, హైడ్రైడ్‌గా ఉండేలా, నీటిని తాగుతూ ఉండటమే. మరి ఆ సిగ్నల్స్‌ ఏంటంటే..  శరీరంలో నీటి స్థాయి తగ్గగానే, చిన్నగా మంటగా అనిపిస్తుంది. డీహైడ్రేషన్‌కు గురయితే, మెదడుకు రక్త ప్రవాహం తగ్గటంతో పాటు, మెదడకు అందాల్సిన ఆక్సిజన్‌ తగ్గిపోతుంది. దీనివల్ల తలనొప్పి, డిమ్‌గా ఉండటం, తలతిరగటం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కల్పిస్తే.. మీలో నీటి(Drinking Water) స్థాయి తగ్గిపోయిందని గుర్తుపెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు మంచి నీటిని తాగేందుకు ప్రయత్నం చేయాలి.

తిమ్మిర్లు పట్టడం, నోరు, చర్మం పొడిబారటం, దాహం వేయటం, గాఢమైన మూత్రం రావటం వంటి లక్షణాలన్నీ శరీరంలో నీటి స్థాయి తగ్గిందని చెప్పటానికి కనిపించే సంకేతాలు. మహిలలు అయితే రోజుకు 11.5 కప్పులు, పురుషులు 15.5 కప్పుల నీటిని తాగాలని నిపుణులు చెప్తున్నారు. మీరు చేసే వ్యాయామం, మీ చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితి బట్టి నీటిని తాగుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి తీసుకోవాల్సిన నీటి పరిమాణం మారుతూ వస్తుంది కాబట్టి.. తరచుగా నీటిని తాగటం ఉత్తమమని చెప్తున్నారు.

హైడ్రేడ్‌గా ఉండాలంటే, కేవలం నీటిని మాత్రమే కాదు, పండ్లు, జ్యూస్‌లు తీసుకోవటం కూడా ఒక మార్గమని గుర్తుంచుకోండి. ద్రాక్ష, పుచ్చకాయ వంటి పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తీసుకోవటం వల్ల, శరీరానికి తగిన నీరు అందటంతో పాటు, పోషకాలు కూడా లభిస్తాయి.
చర్మం కాంతివంతంగా ఉండాలంటే, శరీరంలో నీటి స్థాయి సక్రమంగా ఉండాలి. బరువు తగ్గటంలో, శరీరంలోని మలినాలు తొలగిపోటానికి తగిన నీటిని తీసుకోవటమే సరైన మార్గం అని చెప్తున్నారు నిపుణులు.

అతి వద్దు
మంచిది కదా అని అతిగా ఏది తీసుకున్నా ప్రమాదమే. అది మంచినీటికి కూడా వర్తిస్తుంది. శరీరానికి మంచిది కదా అని మోతాదుకు మించి మంచినీరు తాగటం వల్ల, మంచి దేవుడెరుగు, చెడు ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ నీటిని శరీరంలోకి వెళ్లటం వల్ల, రక్తంలో ఉండే సోడియం తగ్గటంతో, కిడ్నీలపై భారం పడుతుందని నిపుణులు తెలిపారు. దీని వల్ల అనారోగ్య బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి నీటిని సరైన మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...

వైసీపీకి భారీ షాక్.. మరో కీలక దళిత నేత రాజీనామా

ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు...