ఇండియా కరోనా అప్డేట్..1247 కొత్త కేసులు..భారీగా తగ్గిన మరణాలు

0
67

కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. కానీ ప్రస్తుతం కరోనా విజృంభణ క్రమక్రమంగా తగ్గుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నా… మన దేశంలో మాత్రం రోజురోజుకు కేసులు తగ్గుతున్నాయి. కానీ హర్యానా, ఢిల్లీల్లో స్వల్పంగా కేసులు పెరగడం ప్రజలు కాస్త ఆందోళన పడాల్సిన విషయమే.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో1247 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,11,701కు చేరింది. ఇక దేశంలో దేశంలో యాక్టివ్ కేస్ లోడు 0.03 శాతంగా ఉంది.  దేశంలో తాజాగా 01 మంది కరోనాతో మరణించ గా మృతుల సంఖ్య 5,21,966కి చేరింది. రికవరీ రేట్ 98.76 శాతంగా, డెత్ రేట్ 1.21 శాతంగా ఉంది.