ఏపీ ప్రజలకు భారీ ఊరట..మరింత తగ్గిన కరోనా..జిల్లాల వారిగా కేసుల వివరాలివే

A huge burden on the people of AP..a further reduced corona..district wise details

0
136

ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 27,522 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 1679 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు  క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 14,653 మంది క‌రోనా కాటుకు బ‌లైయ్యారు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 9,598 మంది క‌రోనా మహ‌మ్మారి నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  102

చిత్తూరు         102

ఈస్ట్ గోదావరి   350

గుంటూరు  212

వైస్సార్ కడప  104

కృష్ణ   225

కర్నూల్  103

నెల్లూరు   91

ప్రకాశం    87

శ్రీకాకుళం 22

విశాఖపట్నం  128

విజయనగరం 11

వెస్ట్ గోదావరి   142