ఏపీ ప్రజలకు భారీ ఊరట..తగ్గిన కరోనా ఉధృతి..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

Massive soreness for AP people..sensured corona calm

0
170

ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగిస్తుంది. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 19,241 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 335 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 14,713 మంది క‌రోనా కాటుకు బ‌లైయ్యారు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 936 మంది క‌రోనా మహ‌మ్మారి నుంచి కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  33

చిత్తూరు         16

ఈస్ట్ గోదావరి   52

గుంటూరు  36

వైస్సార్ కడప  18

కృష్ణ   26

కర్నూల్  4

నెల్లూరు   19

ప్రకాశం    25

శ్రీకాకుళం 1

విశాఖపట్నం  18

విజయనగరం 3

వెస్ట్ గోదావరి   84