తెలంగాణ గోపాలమిత్రులకు శుభవార్త

-

తెలంగాణలో రైతుల నేస్తంగా పిలిచే గోపాలమిత్రలకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. గోపాలమిత్రులకు దసరా కానుక ఇస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. 30 శాతం జీతాలు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రస్తుతం రూ. 8,500 చెల్లిస్తుండగా, 30 శాతం అంటే రూ. 2,550 పెంచి మెుత్తం రూ. 11,050 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ జీతాల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా మెుత్తం 1530 మంది గోపాలమిత్రలు లబ్ధిపొందుతున్నట్లు వివరించారు. వీరికి రూ.3,500గా ఉన్న జీతాన్ని ఒకేసారి రూ.8,500లకు సీఎం కేసీఆర్‌ పెంచినట్లు గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరే విధంగా సంస్కరణలు చేస్తుందని మంత్రి అన్నారు. గోపాలమిత్రులు పాడి రైతులతో నేరుగా సంప్రదింపులు చేసిన కృషి ఫలితంగా పాల సేకరణ రికార్డు స్థాయిలో పెరిగినట్లు వివరించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వటంతో పాటు, పాడి గేదెల గర్భధారణ, నట్టల నివారణ మందులు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ, గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ఉంటున్నారని మంత్రి కితాబునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...