పేద‌ల కోసం ఈ కుటుంబం సంచ‌ల‌న నిర్ణ‌యం రియల్లీ గ్రేట్

-

మ‌న‌కు ఉన్న దానిలో ఎంతో కొంత సాయం చేసి, నిరుపేద‌ల‌కు లేనివారికి చేయూత అందివ్వాలి అని అంటారు , ఇలా సాయం చేసేవారు చాలా మంది ఉంటారు.. పేరు కోసం గొప్ప కోసం తాప‌త్ర‌యం ఉండ‌దు.. పిలిచి లేనివారికి సాయం అందించే మ‌హానుభావులు చాలా మంది ఉన్నారు.

- Advertisement -

అయితే ఓ 80 ఏళ్ల వయసున్న ఆ వృద్ధదంపతులు. వారి సొంత భూమిలోనే పేదల కోసం ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. కేరళ త్రిస్సూర్ కు చెందిన కోరట్టి వర్గీస్, అతని భార్య ఫిలోమెనాలు ఈ మంచి నిర్ణ‌యం తీసుకున్నారు, అయితే ఇందులో పేద‌ల కోసం ఇళ్లు క‌ట్టించి వారే ఇవ్వ‌నున్నారు.

అంతేకాదు దీని కోసం ఎవ‌రిని విరాళాలు కూడా అడ‌గ‌టం లేదు,వర్గీస్ సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. భార్య ఫిలోమెనా ఉపాధ్యాయురాలిగా పని చేసి పదవీ విరమణ పొందారు. తాము చిన్న‌త‌నంలో పేద‌రికం చూశాం మాకు సాయం చేసే స్దోమ‌త ఇప్పుడు ఉంది అందుకే పేద‌ల‌కు సాయం చేస్తున్నాం అంటున్నారు.
ఇద్ద‌రూ..

ఇక వారు రిటైర్ అయ్యాక కలప వ్యాపారం ప్రారంభించారు. ఐదు పేద కుటుంబాలకు ప్రస్తుతం వారు ఇళ్లను నిర్మిస్తున్నారు. వాటితో పాటే ఒక వృద్ధాశ్రమాన్నిక‌డ‌తాము అంటున్నారు అంతా వారి సొంత న‌గ‌దుతోనే రియ‌ల్లీ గ్రేట్ క‌దా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...