ఎంత కన్విన్స్ చేసినా తప్పలేదు.. ఆదిపురుష్‌లో ఆ డైలాగ్స్ తొలగింపు

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) సీతగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్(Adipurush). ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది. విడుదలకు ముందు నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఈ చిత్రానికి విడుదలయ్యాక కూడా ట్రోల్స్ తప్పలేదు. మొదటిరోజు ఊహించిన విధంగా వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే, ఆదిపురుష్ డైలాగ్స్‌పై తీవ్ర విమర్శల నేపథ్యంలో మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మూవీలోని కొన్ని డైలాగ్స్‌పై తాము ఎన్ని వివరణలు ఇచ్చినా అవి మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోతున్నాయి. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన డైలాగ్స్ తీసేయాలని డిసైడ్ అయ్యాం. వాటి స్థానంలో కొత్త డైలాగ్స్ యాడ్ చేస్తున్నాం. వచ్చేవారం నుంచి ఇవి సినిమాలో అందుబాటులోకి వస్తాయి’ అని ఆదిపురుష్(Adipurush) రచయిత మనోజ్ ముంత్ శిర్(Manoj Muntashir Shukla) ట్వీట్ చేశారు.

- Advertisement -
Read Also:
1. ఆదిపురుష్ రచయిత కీలక వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...