ఆ సినిమా అప్పుడు ప్రతి రోజూ ఏడ్చాను: తృప్తి

-

‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న అందాల భామల్లో తృప్తి డిమిత్రి(Tripti Dimri) ఒకరు. ఈ సినిమాలో తన అందాలతో కుర్రకారును కట్టిపడేసిందీ అమ్మడు. ఇటీవల తృప్తి తమను మోసం చేసిందంటూ కొందరు ప్రచారం చేయడంతో అదో చిన్నపాటి వివాదంగా కూడా మారింది. ఆ అంశంపై తృప్తి టీమ్ కూడా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తృప్తి తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంది. తనకు ఏమీ తెలియకుండానే ఇండస్ట్రీలోకి వచ్చేశానని, తొలి రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పిందీ అమ్మడు. తనకు ఇప్పటికి కూడా నటన ఓనమాలు కూడా తెలియదని, ప్రతి సినిమా షూటింగ్‌లో ఇతర స్టార్స్ నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పింది.

- Advertisement -

‘‘చదువులో రాణించలేకపోయాను. దాంతో మోడలింగ్ వైపు అడుగులు వేశా. ఇంట్లో అంగీకరించకపోయినా వినలేదు. తీరా వచ్చిన తర్వాత బేసిక్స్ కూడా తెలియకుండా చాలా ఇబ్బంది పడ్డాను. ఫొటోగ్రఫీ డైరెక్టర్, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. ప్రతి సన్నివేశాన్ని తోటి నటీనటులతో చర్చించేదాన్ని. నా తొలి సినిమా లైలా మజ్ను సమయంలో ప్రతి రోజూ ఏడ్చాను. వాళ్లు చెప్పే భాష నాకు అర్థమయ్యేది కాదు. ఇంటికెళ్లి నా పాత్ర డైలాగ్స్‌ను ప్రాక్టీస్ చేసేదాన్ని’’ అంటూ కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను వివరించింది అమ్మడు(Tripti Dimri).

Read Also: యానిమల్ బ్యూటీ తృప్తి మోసం చేసిందా…! ఆమె టీమ్ ఏమంటోందంటే..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం..

విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) ఇంట విషాదం అలుముకుంది. ఆయన కూతురు...

లవంగాలతో ఇన్ని లాభాలా..

లవంగాలు(Cloves).. భారతదేశ వంటకాల్లో తరచుగా వాడే దినుసుల్లో ఒకటి. వీటి వల్ల...