బాలుకి ఆ సర్జీరీ వద్దని చెప్పినా చేయించుకున్నారా ?

-

బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు, ఆయన ఆత్మకి శాంతిచేకూరాలి అని అందరూ ప్రార్ధిస్తున్నారు, గానగంధర్వుడు ఇక భౌతికంగా లేరు, అయితే ఆయన గురించి ఆయన వెంట ఉన్న వారు ఆయనతో పని చేసిన వారు అనేక విషయాలు తెలుపుతున్నారు

- Advertisement -

తాజాగా ఆయనకు గతంలో జరిగిన ఓ సర్జరీ గురించి వార్త వినిపిస్తోంది. ఆయన సహజంగా గొంతు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు, చల్లటి పదార్దాలు కూడా ఆయన ఎక్కువ తీసుకోరు
గీతాంజలికి డబ్బింగ్ చెప్పే సమయంలో బాలుకు గొంత సమస్య వచ్చింది. డాక్టర్ వద్దకు వెళ్తే చిన్న బొడిపె ఉన్నట్లు తెలిసింది. దీనికి సర్జీరీ చేయించుకోవచ్చు, లేదా మెడిసన్ వాడచ్చు అని తెలిపారు

ఈ సమయంలో ఆయనకు లతా మంగేష్కర్ ఫోన్ చేశారు, బాలు సర్జీరీ చేయించుకోకు, మనకు స్వరం దేవుడుఇచ్చిన వరం అని చెప్పారు, దాంట్లో మెటల్ పడకూడదని ఆమె చెప్పారట. అయితే, ఎస్బీ బాలు ఆమె మాటకి అక్కడ ఎస్ చెప్పి తర్వాత రోజు ఆపరేషన్ చేయించుకున్నారు

నాలుగు రోజులు రెస్ట్ ఇచ్చి తర్వాత సినిమాలకు పాటలు పాడారు డబ్బింగ్ చెప్పారు, అసలు ఏ విషయంలో అయినా ఆయన భయపడరు అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...