Kriti Sanon | ‘ఆదిపురుష్’ చూసిన సీత.. ఫ్యాన్స్ ఏం చేశారంటే?

-

ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌(Adipurush)’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైంది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌, జానకిగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కృతి సనన్(Kriti Sanon) నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(OM Raut) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా, గురువారం (జూన్‌ 15) రాత్రి ఆదిపురుష్‌ స్పెషల్‌ షో వేశారు. మూవీ యూనిట్‌, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ఈ స్పెషల్ స్ర్కీనింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షోకు కృతి సనన్‌ కూడా హాజరైంది. ఆమెతో పాటు తల్లిదండ్రులు రాహుల్‌ సనన్‌, గీతా సనన్‌ కూడా వచ్చారు. ఈ సందర్భంగా కృతి సనన్‌(Kriti Sanon)తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే ఆమె ఎంతో ఓపికగా వారందరితో ఫొటోలు, సెల్ఫీలు దిగింది.

Read Also:
1. భీమవరంలో ‘ఆదిపురుష్’ సినిమా నిలిపివేత.. ఎందుకంటే?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి...

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

YS Jagan Foreign Tour | విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి...