వారంరోజుల్లో విడుదల.. వివాదంలో గోపీచంద్ కొత్త సినిమా

-

టాలీవుడ్ సీనియర్ హీరో గోపీచంద్ వివాదాలకు దూరంగా ఉంటారు. సెలైంట్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి గోపీచంద్(Gopichand) అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన రామబాణం(Rama Banam) చిత్రం వారంరోజుల్లో విడుదల కానుండగా.. ఆయనకు అనూహ్యంగా చిక్కులు వచ్చి పడ్డాయి. రామబాణం సినిమాలో ఐఫోన్ పిల్ల.. అంటూ సాగే ఓ పాట ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో నా ప్రాణం ఆగదే పిల్ల.. అనే లైన్ ఉంది. తాజాగా కరీంనగర్‌కు చెందిన గొల్లపల్లి రవీందర్ అనే ఫోక్‌ సింగర్‌ ఈ పాట తనదే, ట్యూన్ కూడా తనదేనంటూ మీడియాను ఆశ్రయించారు.

- Advertisement -

గొల్లపల్లి రవీందర్‌ ఈ పాటను 1992లో చేతికి గాజులు పిల్లో పాట రాశానని చెబుతున్నారు. అప్పట్లోనే ఆ పాటా బాగా హిట్‌ అయ్యిందని తెలిపారు. ఆ పాటలోని లైన్‌ను, తన ట్యూన్‌ని రామబాణం యూనిట్ వాళ్ళు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఆయన ఆరోపణలపై రామబాణం(Rama Banam) చిత్రబృందం స్పందించలేదు. కాగా, ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి జంటగా నటించింది. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా మే 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

Read Also: తనను అలా చూడం ఇబ్బందిగా అనిపించింది: అలియా భట్
Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...