Guntur Kaaram | ‘కుర్చీ మడతపతపెట్టి’ అంటూ స్టెప్పులు ఇరగదీసిన మహేశ్‌..

-

సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) ఫ్యాన్స్‌కు మంచి మాస్ సాంగ్ కిక్ ఎక్కించనుంది. ‘గుంటూరు కారం(Guntur Kaaram)’నుంచి మాస్ మసాలా సాంగ్ విడుదలకు రంగం సిద్ధమైంది.’కుర్చీ మడతపెట్టి‘ అంటూ సాగే ప్రోమోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట పూర్తి లిరికల్ వీడియోను రేపు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పాటలో మహేశ్, శ్రీలీల డ్యాన్స్ అభిమానులను కిర్రెక్కించేలా ఉంది.

అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో గుంటూరు కారం(Guntur Kaaram)పై భారీ అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన శ్రీలీల(Sreeleela) మెయిన్‌లీడ్‌గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది.
Read Also: ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...