Kona Venkat | ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తా: కోన వెంకట్

-

రచయిత కోన వెంకట్(Kona Venkat) ‘అదుర్స్’ సీక్వెల్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కోన నిర్మాతగా వ్యవహరించిన ‘గీతాంజలి’కి సీక్వల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్ లాంచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ “అదుర్స్ సినిమాలో చారీగా ఎన్టీఆర్ చేసిన నటన ఇంకెవరు చేయలేరు. ఆ సినిమాకి సీక్వెల్ తీసుకురావాలని నాకు ఎప్పటినుంచో ఉంది. ఆ సీక్వెల్ కథ రాసుకున్న తరువాత.. ఎన్టీఆర్ ఇంటిముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేసి అయినా సీక్వెల్‌కి ఒప్పిస్తాను.వినాయక్‌తోనే సీక్వెల్ చేస్తా” అంటూ తెలిపారు.

- Advertisement -

కాగా ఎన్టీఆర్(NTR) హీరోగా నటించిన సాంబ, అదుర్స్, బాద్‌షా, జైలవకుశ సినిమాలకు కోన వెంకట్(Kona Venkat) పనిచేశారు. ఇందులో అదుర్స్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. కొంతకాలంగా ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం దేవరతో పాటు వరుసగా భారీ బడ్జెట్ సినిమాలకు కమిట్ అయ్యాడు. దీంతో ‘అదుర్స్2’ ఎప్పుడు తెరకెక్కుతుందో వేచి చూడాలి.

Read Also: సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహిళను కొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని...

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...