Guntur Kaaram | ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.. పూనకాలు అంతే..

-

Guntur Kaaram | సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే పాట వచ్చేసింది. ‘కుర్చీ మడతపెట్టి..’ఫుల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో మహేశ్, శ్రీలల డ్యాన్స్ అదరగొట్టారు. థమన్ మాస్ బీట్‌కు ఇద్దరూ పోటాపోటీగా స్టెప్పులు ఇరగదీశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధాలు లేకుండా పోయాయి. ఇక పాటను సాహితి చాగంటి, శ్రీ కృష్ణ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. పాట మధ్యలో ‘ఏంది అట్టా సూత్తన్నావ్. ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్ రైటర్. రాసుకోండి…. మడతెట్టి పడేయండి’అంటూ మహేష్ డైలాగ్ చెప్పి మరింత ఊపు తీసుకొచ్చారు.

- Advertisement -

అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో గుంటూరు కారం(Guntur Kaaram)పై భారీ అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన శ్రీలీల(Sreeleela) మెయిన్‌లీడ్‌గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది.

Read Also: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...