Mahesh Babu | థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేసిన మహేష్ బాబు..

-

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తన అభిమానులతో కలిసి ‘గుంటూరు కారం’ మూవీ చూశాడు. హైదరాబాద్‌లో తన ఫేవరెట్ థియేటరైన సుదర్శన్‌కు భార్య నమ్రత, ఇతర కుటుంబసభ్యులో కలిసి విచ్చేశాడు. దీంతో ‘జై బాబు.. జైజై బాబు’.. ‘మహేష్ అన్న’ అంటూ థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కూడా అనేకసార్లు సుదర్శన్ థియేటర్‌(Sudarshan Theater)లో ఫ్యాన్స్‌తో కలిసి తన సినిమాలను వీక్షించాడు.

- Advertisement -

మరోవైపు ‘గుంటూరు కారం(Guntur Kaaram)’ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. రాత్రి ఒంటి గంటకే బెనిఫిట్ షోలు పడటంతో చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికే మూవీనీ చూశారు. సినిమా మొత్తం మహేష్ బాబు వన్ మాన్ షో అని చెబుతున్నారు. శ్రీలీలతో కలిసి మహేష్ చేసిన డ్యాన్స్‌లు సూపర్బ్‌ అంటున్నారు. త్రివిక్రమ్ డైలాగులు కూడా అదిరిపోయాయట. దీంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల రచ్చే కనిసిస్తోంది. విజయవాడలో అయితే లేడీ ఫ్యాన్స్ డ్యాన్స్‌లు వేస్తూ తెగ హంగామా చేశారు. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం.

Read Also: ముంబై మెట్రోలో ప్రయాణించిన స్టార్ హీరో అక్షయ్ కుమార్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...