పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామ్‌చరణ్(Ram Charan) దంపతులు, చిరు సతీమణి సురేఖ భావోద్వేగానికి గురయ్యారు. కాగా గతంలోనే చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు రంగాల ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. 5 మందికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. అయితే వీరిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రదానం చేశారు. ఇక మిగిలిన వారికి ఇప్పుడు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువు కేంద్రమంత్రులతో పాటు అధికారులు అతిథులుగా హాజరయ్యారు.

Read Also: జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...