సీనియర్ నటుడు నరేశ్ కు బిగ్ షాక్ ఇచ్చిన మూడో భార్య

-

సీనియర్ నటుడు వీకే నరేశ్, నటి పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మళ్లీ పెళ్లి(Malli Pelli)’ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సమయంలో నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi) బిగ్ షాక్ ఇచ్చింది. తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా తీశారని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలుచేశారు. ఈ సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రమ్య కోర్టును ఆశ్రయించడంతో సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. కాగా రమ్య రఘుపతిని నరేశ్(VK Naresh) మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో నరేశ్ పవిత్రా లోకేశ్(Pavitra Lokesh) తో బంధం కొనసాగిస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండా ఆమెతో ఎలా కలిసి ఉంటారని ఆమె ఘర్షణ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిజజీవిత సంఘటన ఆధారంగా నరేశ్ MS రాజు దర్శకత్వంలో ‘మళ్లీ పెళ్లి(Malli Pelli)’ సినిమా తీశారు.

- Advertisement -
Read Also:
1. ఆ టైంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: పవిత్రా లోకేశ్
2. ఆ కలలు ఎక్కువ వస్తున్నాయా… అయితే కారణం ఇదే..!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...