అందుకే సరోగసి ద్వారా పిల్లల్ని కన్నాం.. ప్రియాంక చోప్రా క్లారిటీ

-

Priyanka Chopra Opens up about her Surrogacy: స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ జంట సరోగసి ద్వారా ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రియాంక ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. పిల్లల్ని కంటే ఆమె అందం తగ్గిపోతుందని, గ్లామర్ తగ్గితే సినిమా అవకాశాలు తగ్గిపోతాయనే భయంతోనే ప్రియాంక ఈ నిర్ణయం తీసుకుందని పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్లపై దంపతులిద్దరూ ఎప్పుడూ స్పందించింది లేదు. ఎట్టకేలకు సరోగసీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో ప్రియాంక చోప్రా క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

‘నాకు వైద్యపరమైన సమస్యలున్నాయి. అందుకే సరోగసి విధానాన్ని ఎంచుకున్నాం. విమర్శలకు దారితీస్తుందనే పరిస్థితుల కారణంగా ఈ విషయాన్ని చాలా కాలం ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడ్డాం. ఇది జీవితంలో అత్యంత కీలకమైన దశ. మీకు నా గురించి పూర్తిగా తెలియదు. నేను ఏం అనుభవించానో తెలియదు. కారణాలు ఏమైనప్పటికీ సరోగసీ ప్రయాణం గురించి ప్రజలతో చర్చించాలని ఫిక్స్ అయ్యా. నా గురించి తప్పుగా మాట్లాడినా పట్టించుకోను. కానీ మా కూతురు గురించి మాట్లాడితేనే బాధంగా ఉంటుంది. దయచేసి ఆమెపై ట్రోలింగ్ మానేయండి. ఆ చిట్టి చేతులను పట్టుకున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో నాకే తెలుసు’ అని వెల్లడించింది ప్రియాంక చోప్రా.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tillu Square OTT | ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'టిల్లు స్క్వేర్(Tillu Square...

Nominations | ఏపీ, తెలంగాణలో రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ...