‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం.. థియేటర్ల వద్ద కాంగ్రెస్ ఆందోళన

-

‘ది కేరళ స్టోరీ(The Kerala Story)’ సినిమా వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్(Pinarayi Vijayan) తో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ముస్లిం సంఘాలు ఫైర్ అవుతున్నాయి. సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళ, తమిళనాడులో శుక్రవారం సినిమా విడుదల నేపథ్యంలో ఆందోళనలు చేపడుతున్నారు. కొచ్చిలోని థియేటర్ల దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సినిమా విడుదలను ఆపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆందోళన నేపథ్యంలో తమిళనాడులోని థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

- Advertisement -

The Kerala Story |థియేటర్లకు పూర్తి భద్రత కల్పించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కేరళలో మతమార్పిడిలు, రాడికలైజేషన్, టెర్రరిజం కాన్సెప్ట్ చేసుకుని ఈ సినిమాను సుదీప్తో సేన్ తీశారు. కేరళలో 32,000 మంది హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన మహిళలను ఇస్లాంలోకి మార్చారని ఐసీస్ చేరడానికి కొంత మంది సిరియాకు వెళ్లినట్లు సినిమా ట్రైలర్ లో చూపించారు. దీంతో వివాదం రాజుకుంది. ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమాను కొన్ని వర్గాలు ఆదరిస్తున్నాయి. ఈ సినిమాను తప్పకుండా చూడాలని అంటున్నారు. ‘పాకిస్తాన్‌లో 2 శాతం, అఫ్ఘనిస్తాన్‌లో ఒక శాతం కంటే తక్కువ మంది హిందువులు మిగిలారు, భారత దేశంలో ఈ సినిమా రుజువు చేస్తుంది’ అంటూ ఆన్లైన్‌లో ప్ల కార్డ్స్ ప్రదర్శిస్తున్నారు.

Read Also: రొమాన్స్ చేయడానికే తీసుకుంటున్నారు: అనసూయ షాకింగ్ కామెంట్స్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...