సౌత్‌లో రజినీకాంత్ సెన్సేషనల్ రికార్డ్.. కనీవినీ ఎరుగని రేంజ్‌లో పారితోషికం!

-

సౌత్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్‌(Rajinikanth)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ఆయన డిజాస్టర్ సినిమా కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుందంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా.. మరోసారి జైలర్ సినిమాతో రజినీ సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 328 కోట్ల రూపాయలను వసూలు చేసింది. చాలా కాలం తర్వాత రజనీ తన కెరీర్‌లో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు.. ఇప్పుడు సౌత్ ఇండియా స్టూపర్ స్టార్ రికార్డ్ సృష్టించారు. ఈ సినిమా ద్వారా ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా రజనీకాంత్ నిలిచారు.

- Advertisement -

కేవలం రజినీకి మాత్రమే ఈ రికార్డ్ సాధ్యమయ్యింది. తమిళంతోపాటు కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ ఇలా అన్ని చోట్ల జైలర్ మంచి వసూళ్లు రాబట్టింది. అటు విదేశాల్లోనూ ప్రేక్షకుల నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం రజనీకాంత్ రూ.110 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఇక సినిమా విడుదలయ్యే నాటికే రజినీ(Rajinikanth)కి రెమ్యూనరేషన్ డబ్బులు అందించింది నిర్మాణ సంస్థ. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కు డబుల్ సర్ ప్రైజ్ ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. మరోసారి రూ.100 కోట్ల చెక్ ఇచ్చి రజినీని సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు ఓ బెంజ్ కారును కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్ట్ 10న విడుదలైంది.

Read Also: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...