బాలీవుడ్ ఎంట్రీపై సూర్య క్లారిటీ.. ఇప్పుడు చెప్పనంటూ..

-

బాలీవుడ్ ఎంట్రీకి కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొంతకాలంగా ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సీనియర్ డైరెక్టర్ ఓంప్రకాష్ డైరెక్షన్‌లో రానున్న ప్రిస్టీజియస్ మూవీతో తన బాలీవుడ్ ఎంట్రీని సూర్య ప్లాన్ చేశారని, ఇప్పటికే ఆయన క్యారెక్టర్ కూడా ఫైనల్ అయిపోయిందని బీటౌన్ కోడై కూస్తోంది. కానీ ఈ వార్తల్లో ఎంత వరకు నిజమనేది మాత్రం ఎవరికీ తెలియదు. తాజాగా అబుదాబి వేదికగా జరిగిన ఐఫా అవార్డ్ 2024 స్టేజ్‌పై సూర్య క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పూర్తి వివరాలు చెప్పనంటూ మరింత సస్పెన్స్ పెంచేశారు.

- Advertisement -

‘‘బాలీవుడ్ ఇవ్వనున్న విషయం నిజమే. ఓంప్రకాష్(Om Prakash) డైరెక్షన్‌లో ఇది జరగనుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ వర్కా దూసుకెళ్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి, ఇందులో నా పాత్ర గురించి ఇప్పుడే అన్ని విషయాలు చెప్పాలని అనుకోవట్లేదు. సమయం వచ్చినప్పుడు నేను మీకు అన్ని అప్‌డేట్‌లు ఇస్తాను. అప్పటి వరకు ఆగాల్సిందే’’ అంటూ సూర్య(Surya) చెప్పాడు. సూర్య ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ సినిమా అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.

Read Also: రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

టీమ్ పాక్ దుస్థితికి కారణమేంటో చెప్పిన అశ్విన్

టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల...

రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం..

విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) ఇంట విషాదం అలుముకుంది. ఆయన కూతురు...