కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ‘ది కేరళ స్టోరీ’ చిత్రం

-

గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ(The Kerala Story)’. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ సినిమానే ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. ఎన్నో గొడవలు, మరెన్నో కోర్టు కేసులతో దేశమంతా హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రం. ఇలాంటి వివాదాల నడుమ మే 5వ తేదీన విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు అభిమానులకు సుపరిచితురాలైన హీరోయిన్ ఆదాశర్మ(Adah Sharma) కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో కేవలం రూ. 16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. శనివారం వరకు మొత్తంగా రూ.112.99 కోట్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేయడంతో కలెక్షన్లు తగ్గాయని.. అక్కడ కూడా విడుదల చేస్తే మరింత వసూళ్లు వస్తాయని మూవీ క్రిటిక్స్ చెబుతున్నారు.

- Advertisement -
Read Also: అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sathya Sai District | ఏపీలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి… సైనైడ్ కారణమా?

ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలో(Sathya Sai District) దారుణ ఘటన చోటు...

HCU Land Dispute | ‘భూమి బదిలీకి HCU అంగీకరించలేదు’

HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024...