కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ‘ది కేరళ స్టోరీ’ చిత్రం

-

గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన చిత్రం ‘ది కేరళ స్టోరీ(The Kerala Story)’. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ సినిమానే ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. ఎన్నో గొడవలు, మరెన్నో కోర్టు కేసులతో దేశమంతా హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రం. ఇలాంటి వివాదాల నడుమ మే 5వ తేదీన విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు అభిమానులకు సుపరిచితురాలైన హీరోయిన్ ఆదాశర్మ(Adah Sharma) కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో కేవలం రూ. 16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. శనివారం వరకు మొత్తంగా రూ.112.99 కోట్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేయడంతో కలెక్షన్లు తగ్గాయని.. అక్కడ కూడా విడుదల చేస్తే మరింత వసూళ్లు వస్తాయని మూవీ క్రిటిక్స్ చెబుతున్నారు.

- Advertisement -
Read Also: అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

ఏపీ నూతన డీజీపీ(New AP DGP)గా హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర...

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....