యానిమల్ బ్యూటీ తృప్తి మోసం చేసిందా…! ఆమె టీమ్ ఏమంటోందంటే..

-

యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ అయిపోయిన బ్యూటీ తృప్తి డిమిత్రి(Tripti Dimri). అమ్మడి అందాలకు కుర్రకారుకు కునుకులేకుండా పోయింది. యానిమల్ సినిమాతో ముద్దుగుమ్మకు వచ్చిన ఫేమ్ చూసి ఆఫర్లు కూడా క్యూ కట్టాయి. ఇంతలో ఓ వివాదం. అందులో అమ్మడి పేరు. డబ్బులు తీసుకుని మోసం చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. ఓ ఈవెంట్‌కు హాజరవుతానని చెప్పి తమ దగ్గర తృప్తి దాదాపు రూ.5.5 లక్షల తీసుకుందని, తీరా చూస్తే ఈవెంట్‌కు డుమ్మా కొట్టి మళ్ళీ కాంటాక్ట్‌లోకి రాలేదని వాళ్లు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై తృప్తి టీమ్ క్లారిటీ ఇచ్చింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది.

- Advertisement -

‘‘తృప్తి తన షెడ్యూల్ ప్రకారమే ఈవెంట్స్‌కు హాజరవుతారు. సినిమా ప్రమోషన్స్ మినహా వ్యక్తిగతంగా ఎలాంటి ఈవెంట్స్‌లో ఆమె పాల్గొనరు. అందులోనూ ఎలాంటి ఈవెంట్‌లో పాల్గొనడానికి ఆమె డబ్బులు తీసుకోవడం, చెల్లింపులను ఆమోదించడం జరగదు. ఇప్పటివరకు జరగలేదు కూడా. ఆమె(Tripti Dimri) ప్రస్తుతం తన అప్‌కమింగ్ సినిమా ‘విక్కీ విద్య కా వో వాలా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు’’ అని స్పష్టం చేసింది తృప్తి టీమ్.

Read Also: మైగ్రేన్ తలనొప్పి వస్తుందా.. వీటిని ట్రై చేయండి..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పాకిస్థాన్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్‌లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ...

అమరావతికి కొత్త రైల్వే లైన్.. ప్రకటించిన జీఎం అరుణ్

Amaravati | ఏపీకి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు దక్షిణ...