1500 కోట్ల బడ్జెట్ సినిమాకి త్రివిక్రమ్ మాటలు

-

మాటల మాంత్రికుడిగా పేరుతెచ్చుకున్న ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఎన్టీఆర్ సినిమాకి కథలో బిజీగా ఉన్నారు, ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఆయన ఈ చిత్రం చేయనున్నారు, ఇక వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇక ఆయన రాసే డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇటు సినిమాలో మాటలు నిజ జీవితంలో మనకు దగ్గరగా ఉండేలా ఉంటాయి.. అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా మారారు.

- Advertisement -

తాజాగా ఆయన లాక్ డౌన్ సమయంలో ఓ కథకి మాటలు రాసిచ్చారు అని తెలుస్తోంది.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాము రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్టు మూడేళ్ల క్రితం చెప్పారు, అయితే నమిత్ మల్హోత్రా, మధు వంతెన కూడా భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు, ఈ సినిమా దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవనుంది, ఇక సిరీస్ లుగా ఈ రామాయణం రానుంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ ఆయన సంభాషణలు రాయడం పూర్తిచేసినట్టు చెబుతున్నారు. అల్లు అరవింద్ కోరడంతో ఆయన ఈ మాటలు రాసిచ్చినట్లు తెలుస్తోంది, ఇక లాక్ డౌన్ సమయంలో మాటలు రాసిచ్చినట్లు తెలుస్తోంది, ఇక తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో త్రీడీ ఫార్మాట్ లో నిర్మించనున్నారు, ఈ సినిమాకి దర్శకత్వం
దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ, మామ్ ఫేమ్ రవి ఉద్యావర్ చేయనున్నారు, దేశంలో ఉన్న చాలా మంది నటులు ఇందులో నటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...