కత్రినా కైఫ్‌కు అనారోగ్యమా? తీపి కబురు చెప్పనున్నారా?

-

బాలీవుడ్ భామ కత్రికా కైఫ్‌(Katrina Kaif)ను ఏమైంది? అనారోగ్యం వచ్చిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న ప్రశ్నలివి. అమ్మడి అభిమానులు ఆందోళతో అల్లాడిపోతూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఆమె ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లు ఎగబడటంతో అమ్మడు కూడా ఆగి మరీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలోనే కత్రినా కుడి చేతి వెనక ఒక నల్లటి ప్యాచ్‌ను ఉంది. అభిమానుల దృష్టంతా దానిపైకే వెళ్లింది. ఈ క్రమంలోనే కత్రినా కైఫ్‌కు ఏమైంది? అనారోగ్యమా? అన్న ప్రశ్నలు అధికం అయ్యాయి.

- Advertisement -

అసలేంటా ప్యాచ్..

అయితే కత్రినా కైఫ్ చేతికి ఉన్నది గ్లూకోజ్ మానిటర్ అయి ఉంటుందన్న చర్చ కూడా జరుగుతుంది. ఇవి పెట్టుకోవడం వల్ల రోజుకు మూడు నాలుగు సార్లు చేతి వేలుకు సూది గుచ్చుకుని బ్లడ్ షుగర్ స్థాయిలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉండదు. రోజంతా ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను చెక్ చేసుకోవచ్చని కూడా చర్చ జరుగుతుంటే.. మరోవైపు త్వరలో తీపి కబురు చెప్పనుందా? అన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రెగ్నెన్సీ రావడంతోనే అమ్మడు తన హెల్త్ గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు ఈ బ్లాక్ ప్యాచ్ వేసుకున్నారన్న వాదన కూడా బలంగా సాగుతోంది. మరి వీటిలో ఏది నిజమో తెలియాలంటే కత్రినా(Katrina Kaif) నోరు విప్పాల్సిందే.

Read Also: బొప్పాయి ఆకులతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...

‘పవన్ సమయం ఇస్తే ఇదే చెప్తా’.. గుడి ప్రసాదంపై షియాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్...