ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ మరో సినిమా చేయనున్నారా ?

-

2020 ఏడాదిలో ఎన్నడూ లేనంతగా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ వచ్చారు ప్రభాస్, నాలుగు చిత్రాలు ఒకే చేశారు అన్నీ పాన్ ఇండియా చిత్రాలే, అయితే విడుదలకు సిద్దంగా ఉంది రాధేశ్యామ్… ఇక ఆది పురుష్, సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా ఇలా అన్నీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు ఆయన.. ఇక 2022 వరకూ ప్రభాస్ ఈ సినిమాలతో ఫుల్ బిజీ అనే చెప్పాలి.

- Advertisement -

అయితే తాజాగా హృతిక్ రోషన్తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ భారీ యాక్షన్ చిత్రం చేయబోతున్నారట. ఈ వార్త బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది… అక్కడ చాలా మంది దీని గురించి చర్చించుకుంటున్నారు… ఈ యాక్షన్ మూవీకి ప్రభాస్ సెట్ అవుతారు అని భావిస్తున్నారట దర్శకుడు.

ప్రస్తుతం షారుక్ ఖాన్తో పతాన్ తెరకెక్కిస్తున్నారు సిద్ధార్థ్. దీని తర్వాత హృతిక్ రోషన్తో ఫైటర్ తెరకెక్కిస్తారు. ఇవి పూర్తి అయ్యేసరికి ప్రభాస్ కు దాదాపు రెండు చిత్రాలు పూర్తి అవుతాయి.. ఆ తర్వాత ఈసినిమా ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి బీ టౌన్ లో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా? సౌభాగ్యమ్మకు అవినాశ్ తల్లి కౌంటర్

ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులు తీవ్ర...

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...