Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు.. 12 మందికి గాయాలు

-

జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కొన్ని రోజుల క్రితం ఆర్మీ వ్యాన్‌పై దాడి చేసిన తీవ్రవాదులు.. ఆదివారం నాడు ప్రజలపై దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్‌లో గ్రనేడ్ దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ పేలుడులో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్‌లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్‌కు చేరువలో నిర్వహించే వార సంతలో ఈ పేలుడు సంభవించింది. వెంటనే రంగంలోనికి దిగిన భద్రతా సిబ్బంది.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఉగ్రవాదుల ఆచూకీ తెలుసుకోవడం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి అనుమానంగా కనిపించిన వారిని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

కొన్ని రోజుల క్రితం ఆర్మీ వాహనంపై దాడి జరగడంతో ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బందులు నగరమంతా జల్లెడ పడుతున్నాయి. ఇందులో భాగంగానే శనివారం ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. అంతేకాకుండా లష్కరే తోయిబాకు చెందిన అగ్ర కమాండర్ ఉస్మాన్ హతమారినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్(Jammu Kashmir) అంతటా ఉగ్రవాదుల కోసం తీవ్రస్థాయిలో గాలింపులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: ‘యోగి ఆదిత్యనాథ్‌ను అంతం చేస్తాం’.. పోలీసులకు బెదిరింపులు
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...