RBI సంచలన నిర్ణయం.. దేశంలో రూ.2 వేల నోట్లు రద్దు

-

రూ.2 వేల నోట్ల చెలామణిపై ఆర్బీఐ(RBI) సంచలన ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆ నోట్లు నిల్వ చేసుకున్న వారంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, రెండు వేల నోట్లను వినియోగదారులకు ఇవ్వొద్దని బ్యాంకులకు సైతం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది. ఈనెల(మే) 23 నుంచి దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. మొదటి విడతలో రూ.20 వేలు మాత్రమే మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్లు ముద్రణ నిలిపివేశామని ఆర్బీఐ(RBI) స్పష్టం చేసింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా నోట్లు రద్దు చేసినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan).. ఎవరికీ బయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...