బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఏడుగురు మృతి

-

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లో ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నార్త్ 24 పరగణా జిల్లాలోని దత్తపుకూర్‌లో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది.

- Advertisement -

West Bengal | ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక, ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరికొందరు గాయాలపాలయ్యారు. మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి.

Read Also: అమిత్ షా సభపై ఈటల రాజేందర్ ధీమా
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...