Gujarat | అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనంపైకి దూసుకెళ్లిన కారు

-

గుజరాత్(Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్‌(Ahmedabad)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదం జరగ్గా.. అక్కడ గుమిగూడిన జనంపైకి మరో కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని శాటిలైట్ ప్రాంతంలోని సర్ఖేజ్ గాంధీ నగర్ హైవేపై ఉన్న ఇస్కాన్ బ్రిడ్జి‌పై తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఓ కారు ట్రక్కును బలంగా ఢీ కొట్టింది.

- Advertisement -

Gujarat | దీంతో మిగతా వాహనదారులు, పాదచారులు అక్కడ గుమిగూడారు. ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేస్తుండగా.. అదే సమయంలో అతివేగంగా వచ్చిన ఓ జాగ్వార్ కారు అక్కడ గుమిగూడిన జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది స్పాట్‌లోనే మృతిచెందగా.. అందులో ఇద్దరు పోలీసులు ఉన్నారని, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Read Also: మణిపూర్‌ అల్లర్లపై ఫస్ట్ టైం స్పదించిన ప్రధాని
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...