ఎస్పీ నేతపై చెప్పుతో దాడి చేసిన యువకుడు

-

యూపీ రాజధాని లక్నో(Lucknow)లో జరిగిన సమాజ్‌వాద్ పార్టీ(SP)ఓబీసీ సమ్మేళనంలో ఆ పార్టీ నేత స్వామి ప్రసాద్‌ మౌర్య(Swami Prasad Maurya)పై ఓ యువకుడు దాడి చేశాడు. లాయర్‌ వేషంలో ఉన్న ఆ యువకుడు చెప్పులు కూడా విసిరాడు. దీంతో అక్కడ దుమారం చెలరేగింది. ఎస్పీ కార్యకర్తలు అతన్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్వామి ప్రసాద్‌ మౌర్యపై దాడి చేసిన ఆ యువకుడిని ఆకాష్‌ సైనీగా గుర్తించారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విభూతిఖండ్(Vibhuti Khand) పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

హిందూమతంపై స్వామి ప్రసాద్‌ మౌర్య(Swami Prasad Maurya) చేసిన వ్యాఖ్యలు తనను బాధించినట్టు చెప్పాడు ఆ యువకుడు. ఐతే అతను నిజంగా లాయరేనా లేక న్యాయవాది వేషంలో వచ్చాడా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. లక్నో ఇందిరాగాంధీ ప్రతిష్టాన్‌లో ఓబీసీ సమ్మేళనం జరుగుతోంది. ఈ సదస్సుకు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కూడా రావాల్సి ఉంది. అంతలోనే ఈ గొడవ జరిగింది.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్షా 40వేల జీతంతో ఉద్యోగాలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. 30వ స్థానంలో హైదరాబాద్..

తెలంగాణ పదో తరగతి ఫలితాలు(TS SSC Results) విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ...

Janasena | జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై ఈసీ కీలక ఆదేశాలు..

ఎన్నికల వేళ జనసేన(Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది....