Arvind Kejriwal | మోడీని వదిలించుకోవడానికి దేశ ప్రజలు రెడీగా ఉన్నారు: కేజ్రీవాల్

-

బెంగళూరు వేదికగా విపక్షాల భేటీ రోజు కొనసాగుతోంది. కేంద్రంలోని బీజేపీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా 25 కీలక పార్టీలు బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌‌లో సమావేశం అయ్యాయి. ఈ సమావేశానికి హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ(PM Modi) గత పదేళ్లలో దేశంలోని ప్రతి రంగాన్ని అమ్మకానికి పెట్టారని విమర్శించారు. ప్రజల మధ్య ద్వేశాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థను చిందరవందర చేశారని మండిపడ్డారు. మోడీ హాయాంలో ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు అన్ని రంగాల్లో నిరుద్యోగం పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపుదామా? అని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Read Also: కేటీఆర్ కి రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....