Uma Bharati: రాముడు ‘బీజేపీ’ సొంతం కాదన్న బీజేపీ మహిళా నేత

-

BJP leader Uma Bharati says Lord Ram, Hanuman not BJP workers: బీజేపీ జాతీయ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి రాముడు పై చేసిన వ్యాఖ్యలు దూమారంరేపుతున్నాయి.  కాంగ్రెస్ సీనియర్ లీడర్ కమల్ నాథ్ మద్యప్రదేశ్ లో త్వరలో హనుమంతుడి ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా.. శ్రీరాముడి పై, హనుమంతుడి పై బీజేపీ కి ఎలాంటి పేటెంట్ హక్కులు లేవని అన్నారు. దేవతలను ఏ మతానికి, కులానికి ఆపాదించవద్దని అన్నారు.

- Advertisement -

రాముడు, హనుమంతుడు మొగలుల, బ్రిటిషర్లు, జనసంఘ్ ఉనికికి ముందే ఉన్నారని కూడా వ్యాఖ్యానించారు. వారేమి బీజేపీ పార్టీ కార్యకర్తలు కాదని అన్నారు. అంతే కాదు… భోపాల్ లో ఇటీవల లోది వర్గానికి చెందిన ఒక కార్యక్రమంలో ‘ఎవరికైనా ఓటు వేసుకోవచ్చని’ ఆ స్వేచ్ఛ మీకే ఉందని అనడంతో పార్టీ అసహనం వ్యక్తమవుతోంది. మద్యప్రదేశ్లో మద్యపానం నిషేధం విధించాలని ఈమధ్య మద్యం షాప్ లపై రాళ్లు విసిరి కూడా వార్తల్లో కెక్కారు.

ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఆమె ప్రసంగానికి సంబందించిన ఒక వీడియో ను ట్వీట్ చేసి.. ఉమ భారతి బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారని.. రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం లో భాగంగా ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...