Budget 2024 | ప్రతి ఒక్కరికీ ఇళ్లు.. ఉచిత విద్యుత్.. బడ్జెట్‌లో కీలక హామీలు..

-

Budget 2024 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌లో పలు వరాలు ప్రకటించారు. పార్లమెంట్‌లో తన బడ్జెట్ ప్రసంగంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరే కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. దీని వల్ల గృహ వినియోగదారులకు ఏటా రూ.15వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు.

- Advertisement -

సొంత ఇళ్లు లేని పేద, మధ్యతరగతి ప్రజలకు వచ్చే ఐదేళ్లలో ‘పీఎం ఆవాస్ యోజన గ్రామీణా’ పథకం కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్లనున్నట్లు పేర్కొన్నారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉంటున్న వారి సొంతింటి కలను త్వరలోనే సాకారం చేస్తామని తెలిపారు. అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికి నీరు, విద్యుత్‌, వంటగ్యాస్‌, అందరికీ బ్యాంకు ఖాతాల లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

ఇక ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలు, హెల్పర్లకు శుభవార్త అందించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో వీళ్లనూ అర్హులుగా చేరుస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్‌ను 2021 సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.5లక్షల వరకు బీమా కల్పిస్తోంది.

Budget 2024 | ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా కొత్త ట్యాక్స్ విధానాన్ని నిర్మలమ్మ ప్రవేశపెట్టారు. కొత్త ట్యాక్స్ విధానంలో రూ.7లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదని తేల్చి చెప్పారు. పన్నుల శ్లాబులు యథాతథంగా ఉంటాయని వెల్లడించారు..

Read Also: హేమంత్ సోరెన్ అరెస్ట్.. ఝార్ఖండ్‌ కొత్త సీఎంగా చంపై సోరెన్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బ్యాండేజీతోనే బౌలింగ్ చేస్తున్న షమీ.. ఎందుకోసమో..!

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Shami).. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బ్యాండేజీతోనే...

క్వార్టర్స్‌లోకి సింధు ఎంట్రీ.. చైనాను చిత్తు చేసి మరీ..

ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీలో భారత బాడ్మింటన్ ప్లేయర్ సింధు(PV...