తీరం వైపు దూసుకొస్తున్న బిపోర్‌జాయ్‌ తుపాన్

-

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను(Biparjoy Cyclone) తీవ్ర రూపం ధరించి తీరం వైపు దూసుకొస్తోంది. తుపాను గుజరాత్‌లోని కచ్‌ జిల్లా జఖౌపోర్టు వద్ద తీరాన్ని తాకనుంది. దీంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ(India Meteorological Department) తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు ముందస్తు సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే NDRF, SDRF బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు జూన్‌ 15 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తూపాను ప్రభావంతో ఇప్పటివరకు 67 రైళ్లను రద్దు చేశఆరు. అటు తుపాను ముప్పు నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ(PM Modi) అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం బిపోర్‌జాయ్‌ తుపాను(Biparjoy Cyclone) పోరుబందర్‌కు పశ్చిమ-నైరుతి దిశలో 300 కి.మీలు, ద్వారకకు నైరుతి దిశలో 290 కి.మీలు, జఖౌ పోర్టుకు దక్షిణ-నైరుతి దిశలో 340కి.మీలు దూరంలో ఉంది.

Read Also:
1. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి.. రేవంత్ రెడ్డి ఎమోషనల్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...