అపాచీ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన పెనుప్రమాదం

-

Madhya Pradesh |భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ మధ్యప్రదేశ్‌లోని బింద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చాపర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశాడు. సమస్యను పైలట్ ముందుగానే గమనించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందని.. పైలట్‌ సురక్షితంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వాయుసేనలో ఉపయోగిస్తున్న హెలికాఫ్టర్లు తరచూ ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. AH-64 అపాచీ హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనవిగా పేరు గడించాయి. వీటిని మల్టీరోల్ ఆపరేషన్లలో ఉపయోగిస్తారు. ఈ ఆధునాతన హెలికాఫ్టర్ల కోసం 2020లో భారత సైన్యం బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

- Advertisement -
Read Also:
1. హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ భార్య
2. సంచలనం సృష్టించిన జ్యూవలరీ షాప్ కేసులో కీలక పరిణామం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...