Amit Shah |కర్ణాటకలో అనుకున్న దానికంటే 15 సీట్లు ఎక్కువే గెలుస్తాం: అమిత్ షా

-

దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తుతున్న కర్ణాటక ఎన్నికల ప్రచార ప్రక్రియ ఇవాళ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు విమర్శల డోస్ పెంచారు. తాజాగా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. 224 అసెంబ్లీ సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో అధికారం కాపాడుకోవాలంటే 113 సీట్లు రావాల్సి ఉంది. మే 10న పోలింగ్ నిర్వహించి.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీజేపీ ఈ మ్యాజిక్‌ మార్క్‌ను దాటి మరో 15 సీట్లు ఎక్కువే గెలుస్తుందన్నారు అమిత్ షా. కాంగ్రెస్‌ చేస్తోన్న 40 శాతం కమీషన్‌ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కర్నాటక ఎన్నికల్లో సుడిగాలి పర్యటనలతోపాటు విస్తృతంగా ప్రచారం చేసారు. కర్ణాటక తర్వాత తెలంగాణ(Telangana)లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తంచేశారు.

- Advertisement -
Read Also: సోనియా గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...