మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్రావ్ కోకఠేకు(Manikrao Kokate) న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఓ చీటింగ్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. రెండేళ్ల జైలుతో పాటు రూ.50 వేల జరిమానా కూడా విధించింది. ఆయనతో పాటు ఆయన సోదరుడికి కూడా న్యాయస్థానం శిక్ష విధించింది. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు. దాదాపు 30 ఏళ్ల క్రితం నాటి కేసులో ఇప్పుడు శిక్ష పడటం కీలకంగా మారింది. ఈ మేరకు నాసిక్ కోర్పు వెలువరించింది.
అయితే నకితీ పత్రాలు(Fake Documents) సృష్టించింది, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ కోటాలో ఫ్లాట్లు పొందారని మాజీ మంత్రి, దివంగత టీఎస్ డిఘాలే ముప్పైఏళ్ల కిందట ఫిర్యాదు చేశారు. దాంతో కొకఠే సోదరులపై కేసు నమోదైంది. 1995లో నమోదైన ఈ కేసులో మొత్తం 10 మంది సాక్షులను నాసిక్ జిల్లా సెషన్స్ కోర్టు విచారించింది. అనంతరం కోకఠే సోదరులను దోషులుగా నిర్ధారించింది శిక్ష విధించింది. ఈ సందర్బంగా మాణిక్రావు మాట్లాడుతూ.. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరైనట్లు తెలిపారు. ఈ తీర్పుపై మళ్ళీ అప్పీల్ చేస్తానని ఆయన(Manikrao Kokate) చెప్పారు.