Delhi Liquor case |మనీష్ సిసోడియాను కస్టడీకి ఇవ్వండి – సీబీఐ కోర్టు

-

Delhi Liquor case | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు సోమవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ పాలసీలో చాలా ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారని ఈ కేసులో సిసోడియాను మరింత లోతుగా విచారించాల్సి ఉందని సీబీఐ వాదించింది. మనీష్ సిసోడియా ఒకేసారి అనేక మొబైల్ ఫోన్లను మార్చారని, నిందితులతో మాట్లాడిన సాక్ష్యాలను చెరిపి వేశారని ఆరోపించింది. లిక్కర్ పాలసీలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్స్‌లు పొందిన వారికి లబ్ధి చేకూర్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మనీష్ సిసోడియాను ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. కాగా, ఇరువైపుల వాదనలు విన్న కోర్టు మనీష్ సిసోడియా అరెస్ట్ రిమాండ్‌ను రిజర్వ్ చేస్తూ తీర్పు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...