కుప్పకూలిన ఏడు భవనాలు.. తొమ్మిది మంది దుర్మరణం

-

గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో ప్రకృతి ప్రలయ తాండవం చేస్తోంది. ఒకవైపు వరదలు, మరోవైపు కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇటీవల సిమ్లా రాజాధానిలో శివాలయంపై కొండచరియలు విరిగిపడటంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మరువకముందే కులు ప్రాంతంలో ఇవాళ కొండచరియలు విరిగిపడటంతో ఏడు బహుళ అంతస్థుల భవనాలు కుప్పకూలిపోయాయి.

- Advertisement -

శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడడం కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు స్పందిస్తూ.. కులులో పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వాణిజ్య భవనం కుప్పకూలి పోవడానికి సంబంధించిన వీడియో తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. అధికారులు ఈ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి, ఈ భవనాన్ని రెండు రోజుల క్రితమే ఖాళీ చేయించారని వెల్లడించారు.

Read Also: గద్వాల ఎమ్మెల్యేపై అనర్హత వేటు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...